నల్లగొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ప్రమాదకరమైన మలుపులో నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో జానకిరామ్తోపాటు కారు డ్రైవర్ కూడా ఉన్నారు. కానీ కారును మాత్రం జానకిరామ్ నడుపుతున్నట్టు చెపుతున్నారు. కాగా కారు ప్రమాదానికి గురైన మలుపు చాలా ప్రమాదకరమైన మలుపు అనీ, ఈ మలుపులో గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయనీ ప్రత్యక్ష సాక్షుల కథనం. నందమూరి జానకిరామ్ కారు ఈ ప్రమాదకర మలుపు వద్దకు వచ్చినప్పుడు రాంగ్ రూట్లో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ జానకిరామ్ కారును ఢీకొన్నట్లు చెపుతున్నారు.