Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఐ కోర్టులో జగన్‌కు ఊరట.. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి

ఠాగూర్
బుధవారం, 28 ఆగస్టు 2024 (08:44 IST)
వైకాపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. ఆయన తన కుమార్తెలను చూసే నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో వచ్చే నెల 3వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆయన విదేశాల్లో విహరించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, మొబైల్ నంబర్, మెయిల్ వివరాలు కోర్టుతో సీబీఐకు ఇవ్వాలని కోర్టు షరతు విధించింది. 
 
సుమారుగా 35కి పైగా అక్రమాస్తుల కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న జగన్... వచ్చే నెల 3వ తేదీ నుంచి 25వ తేదీ వరకు బ్రిటన్‌లో ఉన్న తన కుమార్తె పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యేందుకుగాను అనుమతి కోరుతూ 15 రోజుల క్రితం సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంలో జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే, సీబీఐ కోర్టు జగన్‌‍కు షరతులతో విదేశీ పర్యటనకు అనుమతి ిచ్చింది. యూకే వెళ్ళే ముందు పర్యటనకు సంబంధించింన పూర్తి వివరాలను కోర్టుతో పాటు సీబీఐకు అప్పగించాలని ఆదేశించింది. ఇదే క్రమంలో జగన్‌కు ఐదేళ్ల కాలపరిమితో కొత్త పోర్టు జారీకి కూడా సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments