Webdunia - Bharat's app for daily news and videos

Install App

11న మాజీ సీఎం కిరణ్‌ హైదరాబాద్‌కు.. అనుచరులతో భేటీ...?

సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత కొన్నిరోజులకు పదవికి రాజీనామా చేసిన నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డి రాజకీయాలకు దూరమైపోయారు. చిత్తూరు జిల్లా కలికిరి ప్రాంతానికి కిరణ్‌ కుమ

Webdunia
గురువారం, 9 మార్చి 2017 (12:38 IST)
సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత కొన్నిరోజులకు పదవికి రాజీనామా చేసిన నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డి రాజకీయాలకు దూరమైపోయారు. చిత్తూరు జిల్లా కలికిరి ప్రాంతానికి కిరణ్‌ కుమార్ రెడ్డికి జాక్‌పాట్‌లాగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీ హయాంలో లభించింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఏ సమైక్యాంధ్ర ఉద్యమంలో అయితే రాష్ట్రంగా రెండుగా విడిపోయిందే అదే పేరుతో పార్టీని స్థాపించారు కిరణ్‌. కానీ ఆ పార్టీ ప్రజల్లోకి వెళ్ళకపోవడంతో ఇక చేసేదిలేక సైలెంట్ అయిపోయారు.
 
కానీ గత కొన్నినెలలుగా కిరణ్‌ మళ్ళీ రాజకీయాల్లోకి రావాలన్న తన అనుచరులు, సన్నిహితులతో రెండు, మూడు సమావేశమయ్యారు. ఒకసారి వైకాపా, మరోసారి జనసేనలోకి ఇలా రకరకాల నిర్ణయం తీసుకుని మళ్ళీ వెనక్కి తగ్గి.. ఇక వచ్చిన పార్టీలోకి మళ్ళీ వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే కాంగ్రెస్‌ పార్టీలో ఢిల్లీ రాజకీయాలను శాసించేందుకు ఏకంగా రాహుల్ గాంధీనే కలిసి తన మనసులోని మాటలను బయట పెట్టాడు. 
 
ప్రస్తుతం కిరణ్‌ కుమార్ రెడ్డి బెంగుళూరులో ఉన్నారు. ఈనెల 11వ తేదీన హైదరాబాద్ కు రానున్న తన అనుచరులతో మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీలో తనతో పాటు పనిచేసిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపిలు, మాజీ మంత్రులతో సమావేశమవుతున్నారట. సమావేశానికి సంబంధించిన ఆహ్వానాన్ని కూడా ఇప్పటికే అందరికీ పంపించేశారట. అయితే ఈసారి కిరణ్‌ కుమార్ రెడ్డి తీసుకునే నిర్ణయానికైనా కట్టుబడి ఉంటారా అన్న అనుమానాలను ఆయన అనుచరులే వ్యక్తం చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments