Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లమల అడవుల్లో ఎన్‌కౌంటర్: ముగ్గురు మావోల మృతి!

Webdunia
శుక్రవారం, 20 జూన్ 2014 (10:57 IST)
నల్లమల అడవుల్లో జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. సీమాంధ్ర రాజధానికి అనువైన ప్రాంతంగా భావిస్తున్న గుంటూరులో మావోయిస్టుల సంచారం ఉన్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆ జిల్లా పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టగా, మావోలు వారిపై కాల్పులు జరిపారు. దీంతో తేరుకున్న పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరపడంతో ముగ్గురు కీలక మావోయిస్టులు పారిపోయినట్టు సమాచారం. 
 
ఈ కాల్పులు గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో జరిగినట్లు సమాచారం అందుతోంది. ప్రకాశం జిల్లా పుల్లెలచెరువు వద్ద పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. సంఘటనా స్థలంలో ఎకె 47, ఎస్ఎల్ఆర్, ఇతర సామాగ్రి లభ్యమైనట్లు సమాచారం. మృతి చెందిన మావోయిస్టులను జానా బాబూరావు, సారథి, విమలక్కలుగా గుర్తించారు. 
 
పోలీసులు మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న జానా బాబూరావు కూడా మావోయిస్టులతో ఉన్నట్టు వినికిడి. ఎదురుకాల్పుల విషయాన్ని ఇటు గుంటూరు జిల్లా ఎస్పీ గానీ, అటు ప్రకాశం జిల్లా ఎస్పీ గానీ ధ్రువీకరించడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఈ స్థాయిలో ఎదురు కాల్పులు జరగడం ఇదే ప్రథమం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

Show comments