Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాంబారు పాత్రలో పడి ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి.. నల్గొండలో దారుణం

సాంబారు పాత్రలో పడి ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. మధ్యాహ్న భోజనం సమయంలో సాంబారు పాత్రలో పడి గాయపడిన విద్యార్థి శనివారం మృతి చెందాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా కట్టంగూర

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2016 (12:05 IST)
సాంబారు పాత్రలో పడి ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. మధ్యాహ్న భోజనం సమయంలో సాంబారు పాత్రలో పడి గాయపడిన విద్యార్థి శనివారం మృతి చెందాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈదులూరు గ్రామానికి చెందిన బల్కూరి జయవర్ధన్(5) ఒకటో తరగతి చదువుతున్నాడు. 
 
శుక్రవారం మధ్యాహ్న భోజనం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులంతా వరుసలో నిలుచున్నారు. ఈ క్రమంలో వెనుకనున్న విద్యార్థులు తోసుకోవడంతో ముందున్న జయవర్ధన్ వేడి సాంబారు ఉన్న పాత్రలో పడిపోయాడు. దీంతో తీవ్రగాయాలైన ఆ విద్యార్థిని విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించారు. పరిస్థితి విషమించడంతో నల్గొండ ప్రభుత్వాసుపత్రి నుంచి హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శనివారం విద్యార్థి మృతి చెందాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments