Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు పర్యటనలో సంచులు మోసేవారికే చోటు : ఎమ్మెల్యే రోజా

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (17:17 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న జపాన్ పర్యటనలో ఆయన వెంట కేవలం డబ్బు సంచలు మోసే వారికే చోటు దక్కిందని నగిరి ఎమ్మెల్యే, సినీ నటి రోజా ఆరోపించారు. ఇదే అంశంపై ఆమె గురువారం మాట్లాడుతూ.. రాష్ట్రానికి నిధులు తీసుకొస్తామంటూ వెళ్లిన వారిలో సారా వ్యాపారం, మనీ ల్యాండరింగ్, విద్యా వ్యాపారస్థులు, డబ్బు సంచులు మోసే వారున్నారు తప్ప, పెట్టుబడులను రప్పించేందుకు అవసరమైన విషయ పరిజ్ఞానం ఉన్నవారు ఒక్కరూ లేరని విమర్శలు చేశారు.  
 
ఇకపోతే.. అధికారంలోకి వస్తే రైతులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన బాబు, ఇచ్చిన మాట నెరవేర్చలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని ఆమె ఎద్దేవా చేశారు. బాబులా ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి ఉంటే తమ పార్టీ కూడా అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు. చంద్రబాబు మారారని ప్రజలు భావించారని, ఆయన మారడం వాస్తవమేనని, కాకుంటే గతంలో కంటే ఎక్కువ మోసగాడిగా మారారని ఆమె విమర్శించారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments