Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

ఐవీఆర్
బుధవారం, 1 మే 2024 (13:44 IST)
కాపు ఉద్యమ నాయకుడు అని పేరున్న ముద్రగడ పద్మనాభం అకస్మాత్తుగా వైసిపిలో చేరిన విషయం తెలిసిందే. వైసిపిలో చేరిన తర్వాత ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైన గురిపెట్టారు. పిఠాపురంలో ఆయనను ఓడించి తీరుతామని ప్రకటిస్తున్నారు.
 
ఈ సందర్భంగా ఆయన కిర్లంపూడిలో విలేకరులతో మాట్లాడుతూ... ముఖానికి రంగులు వేసుకుని వచ్చేస్తే పిఠాపురం జనం ఓట్లు వేస్తారా? తన్ని తరిమేయడానికి సిద్ధంగా వున్నారంటూ చెప్పుకొచ్చారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయం సాధిస్తే నా పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ప్రతిజ్ఞ చేసారు.
 
ముద్రగడ పద్మనాభం చేసిన ప్రతిజ్ఞపై జనసైనికులు సెటైర్లు వేస్తున్నారు. ఇక ముద్రగడ పద్మనాభం అని చెప్పుకునేకంటే ముద్రగడ పద్మనాభ రెడ్డి పేరే మీకు బాగుంటుందనీ, కాపులకు అన్యాయం చేసిన వారికి వెన్నుదన్నుగా నిలిచిన మీకు పద్మనాభ రెడ్డి పేరు సరిపోతుందంటూ చెపుతున్నారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారనీ, ప్రజలంతా పవన్ కల్యాణ్ నాయకత్వం కోరుకుంటున్నారని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments