Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో యువతి అదృశ్యం... ఫిర్యాదు చేసిన తల్లి...

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (22:40 IST)
తిరుపతిలోని కొర్లగుంటలో యువతి అదృశ్యం కలకలం రేపుతోంది. 18 యేళ్ళ భార్గవి ఈ నెల 3వతేదీ నుంచి కనిపించడం లేదు. ఇంట్లో తల్లి రాణితో పాటు ఉంటున్న భార్గవి కళాశాల ఫీజు కట్టి వస్తానని ఇంటి నుంచి వెళ్ళింది. ఆ తరువాత 25 రోజులవుతున్నా కనిపించకుండా పోయింది. దీంతో తల్లి రాణి స్థానిక ఈస్ట్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. 
 
ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళింది. అలాగే ఐజి, డిఐజికి లేఖ రాసింది. అయితే భార్గవి మేజర్ కావడంతో పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తోంది రాణి. తన కుమార్తెను నందకుమార్, శిరీషలు కిడ్నాప్ చేశారని, కిడ్నాప్ చేసిన విషయాన్ని రాతపూర్వకంగా ఇచ్చినా పోలీసులు మాత్రం మిస్సింగ్ కేసు పెట్టారంటోంది బాధితురాలు. తనకు న్యాయం చేయాలని, తన కుమార్తెను సురక్షితంగా అప్పజెప్పాలని కోరుతోంది.
 
అయితే పోలీసులు మాత్రం భార్గవి తన తండ్రి దగ్గరకు వెళ్ళిపోయి వివాహం చేసుకుందని చెబుతున్నారు. రాణి, భార్గవి తండ్రికి మధ్య గొడవలు ఉన్నాయని దీంతో ఆమె తండ్రి దగ్గరకే వెళ్ళిపోయిందని, ఎన్నిసార్లు రాణికి చెప్పినా అర్థం కావడం లేదంటున్నారు పోలీసులు. మరి దీనిపై ఆమె తన కేసును వెనక్కి తీసుకుంటారో లేదంటా ఇలాగే మాట్లాడుతారో చూడాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments