Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో యువతి అదృశ్యం... ఫిర్యాదు చేసిన తల్లి...

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (22:40 IST)
తిరుపతిలోని కొర్లగుంటలో యువతి అదృశ్యం కలకలం రేపుతోంది. 18 యేళ్ళ భార్గవి ఈ నెల 3వతేదీ నుంచి కనిపించడం లేదు. ఇంట్లో తల్లి రాణితో పాటు ఉంటున్న భార్గవి కళాశాల ఫీజు కట్టి వస్తానని ఇంటి నుంచి వెళ్ళింది. ఆ తరువాత 25 రోజులవుతున్నా కనిపించకుండా పోయింది. దీంతో తల్లి రాణి స్థానిక ఈస్ట్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. 
 
ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళింది. అలాగే ఐజి, డిఐజికి లేఖ రాసింది. అయితే భార్గవి మేజర్ కావడంతో పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తోంది రాణి. తన కుమార్తెను నందకుమార్, శిరీషలు కిడ్నాప్ చేశారని, కిడ్నాప్ చేసిన విషయాన్ని రాతపూర్వకంగా ఇచ్చినా పోలీసులు మాత్రం మిస్సింగ్ కేసు పెట్టారంటోంది బాధితురాలు. తనకు న్యాయం చేయాలని, తన కుమార్తెను సురక్షితంగా అప్పజెప్పాలని కోరుతోంది.
 
అయితే పోలీసులు మాత్రం భార్గవి తన తండ్రి దగ్గరకు వెళ్ళిపోయి వివాహం చేసుకుందని చెబుతున్నారు. రాణి, భార్గవి తండ్రికి మధ్య గొడవలు ఉన్నాయని దీంతో ఆమె తండ్రి దగ్గరకే వెళ్ళిపోయిందని, ఎన్నిసార్లు రాణికి చెప్పినా అర్థం కావడం లేదంటున్నారు పోలీసులు. మరి దీనిపై ఆమె తన కేసును వెనక్కి తీసుకుంటారో లేదంటా ఇలాగే మాట్లాడుతారో చూడాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments