Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌కు సారీ చెబుతున్నా... పిల్లి పార్టీ వీడినట్టేనా?

Webdunia
బుధవారం, 26 జులై 2023 (14:25 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సారీ చెప్పారు. అయితే, తాను పార్టీ వీడుతానన్న అంశంపై ఆయన స్పష్టమైన క్లారిటీ ఇచ్చినప్పటికీ, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. దీంతో ఆయన పార్టీ వీడటం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. 
 
గత కొన్ని రోజులుగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌కు రాజ్యసభ సభ్యులైన పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు మధ్య తీవ్ర స్థాయిలో కోల్డ్ వార్ జరుగుతోంది. దీంతో చంద్రబోస్ జనసేన పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పైగా, పార్టీ వీడుతానని వ్యాఖ్యానించినట్టు ప్రచారం జరిగింది.
 
దీనిపై పిల్లి సుభాష్ చంద్రబోస్ క్లారిటీ ఇచ్చారు. కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొన్నపుడు వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత రాజకీయ నేతలతో ఉంటుందన్నారు. అదే సమయంలో తాను వైకాపాను వీడుతానన ఎన్నడూ చెప్పలేదన్నారు. కానీ, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పిన మాట నిజమేనని తెలిపరు. ఆ వ్యాఖ్యలు కూడా ఎంతో బాధతో చేశానని ఈ విషయంలో సీఎం జగన్‌కు క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trivikram: వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో చిత్రానికి మొదటి అడుగు పడింది

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments