Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ మాట తప్పరు.. ప్రత్యేక హోదాకు కట్టుబడివున్నా : మురళీధర రావు

Webdunia
శనివారం, 23 మే 2015 (10:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట తప్పరని, ఆయన మాటకు కట్టుబడి ఖచ్చితంగా ప్రత్యేక హోదా కల్పిస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ యేడాది పాలనపై ఆయన స్పందిస్తూ.. తొలి ఏడాది పాలనలో సామాజిక భద్రత, అవినీతి రహిత పాలనకు ప్రాధాన్యమిచ్చామన్నారు. 
 
ద్రవ్యోల్బణాన్ని తగ్గించామని, పెట్టుబడులను అమితంగా ఆకర్షించారని చెప్పారు. భవిష్యత్తులో విప్లవాత్మక నిర్ణయాలు ఉంటాయని, ఎవరూ ఊహించని విధంగా ముందుకు దూసుకెళ్తామన్నారు. ఉపాధి అవకాశాలు పెంచుతామని, నైపుణ్యాల అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.
 
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్ విషయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రం మాట తప్పదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సహా అన్ని హామీలను నెరవేరుస్తామన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని విస్మరించబోమని, తమది మాట తప్పే నాయకత్వం కాదని అన్నారు. తెలుగుదేశం పార్టీతో కలిసి బీజేపీ పనిచేస్తుందని, బీజేపీ అన్ని పార్టీలను కలుపుకుని పోవాలని యత్నిస్తుందని వివరించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments