Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో రిలయన్స్ ఎలక్ట్రానిక్ పార్క్ : ముఖేష్ - చంద్రబాబుల భేటీ వీడియో

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్నారు. ఇందుకోసం దేశ విదేశాల్లో తిరుగుతూ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ విజ్ఞప్తి చేస

Webdunia
గురువారం, 15 ఫిబ్రవరి 2018 (15:33 IST)
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్నారు. ఇందుకోసం దేశ విదేశాల్లో తిరుగుతూ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. 
 
ఆయన వినతి మేరకు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ముందుకు వచ్చారు. ఇందులోభాగంగా, ఆయన ఒక రోజు పర్యటన కోసం ఇటీవల విజయవాడకు కూడా వచ్చారు. ఈ సందర్భంగా ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ, చంద్ర‌బాబుపై ప్ర‌శంసల వర్షం కురిపించారు. స‌చివాల‌యంలో రియ‌ల్ టైం గ‌వ‌ర్నెన్స్ కేంద్రాన్ని సంద‌ర్శించిన ముఖేష్ అంబానీ ఆశ్చ‌ర్యం వ్య‌క్తంచేశారు. 
 
ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన అంబానీ ఇదివ‌రకే చంద్ర‌బాబు రాష్ట్రం గురించి వివ‌రించినా ప‌ట్టించుకోలేద‌ని, కానీ రియల్‌ టైం గవర్నెన్స్‌ (ఆర్టీజీ) చూసిన త‌ర్వాత ఆశ్చ‌ర్యానికి లోనైన‌ట్లు చెప్పారు. మాకంటే మీరే ఎంతో ముందున్నారు. మీతో కలిసి పనిచేసేందుకు మేం సిద్ధం. కలలు అందరూ కంటారు.. తానీ వాటిని సాకారం చేసుకునేవారు చాలా తక్కువ మందిమాత్రమే ఉంటార‌ని అంబానీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తిరుపతిలో ఎలక్ట్రానిక్ పార్కు ఏర్పాటుకు ఆయన సూత్ర ప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. కాగా, చంద్రబాబు, ముఖేశ్ అంబానీలకు భేటీకి సంబంధించిన పూర్తి వీడియోను మీరూ ఓసారి తిలకించండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments