హైదరాబాద్: తాను చేస్తున్న కాపు జాతి ఉద్యమం వెనుక ఎవరో ఉన్నారని ఆరోపణలు చేయడం సీఎం చంద్రబాబుకు అలవాటుగా మారిందని ముద్రగడ పద్మనాభం విమర్శించారు. మా ఉద్యమం వెనుక జగన్ ఉన్నాడని ఆరోపిస్తున్నారు... రేపు బీజేపీ, పీఎం నరేంద్ర మోదీ బ్యాంక్ గ్రౌండ్ అంటారు. తర్వాత ఓబామా, బిన్ లాడెన్ మా వెనక ఉన్నారని కూడా అంటారని అసహనం వ్యక్తం చేశారు.