Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగుబోతుల తలకాయలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారు: RRR

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (17:21 IST)
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి వైసీపీ సర్కార్‌‌పై ఫైర్‌ అయ్యారు. రాజకీయాల్లో విలువలను కాపాడడం కోసం జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం తిరుమల నిధులపై గురిపెట్టిందని, వెంకన్ననూ వదలడం లేదని, ‘మా దేవుడిని వదిలేయమని వేడుకుంటున్నానని’ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. 
 
గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టీటీడీ నుంచి ప్రస్తుతం ఏడాదికి రూ.1.25 కోట్లు వస్తుండగా, ఇక నుంచి ఏటా రూ.50 కోట్లు వచ్చేలా ఆర్డినెన్స్‌ తీసుకురావాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారని అన్నారు. వెంకన్న నగలు కూడా అమ్మేస్తారేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. స్వామి ఆస్తులను ముట్టుకోవద్దంటూ భక్తులందరూ కలిసి సీఎంకు వినతిపత్రం పంపిద్దామని రఘురామ పిలుపు ఇచ్చారు.
 
తాగుబోతుల తలకాయలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారని చురకలు అంటించారు.. వెంకన్న ఆస్తులను ముట్టుకోవద్దు అంటూ  వెంకన్న భక్తులు అందరూ కూడా ముఖ్యమంత్రి కి వినతిపత్రం పంపిద్దామని తెలిపారు. ''మా దేవుడిని వదిలేయండి అని వేడుకుంటున్నా. అశోక్ గజపతి రాజును వెంటాడుతున్నారు.'' అని రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments