అగ్నికి ఆహుతైన అంతర్వేది రథం - ఓ మతంపై జరిగిన దాడి : వైకాపా ఎంపీ

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (11:23 IST)
అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన రథం అగ్నికి ఆహుతి కావడం వెనుక పెద్ద కుట్రే ఉందని వైకాపాకు చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. అంతర్వేదిలో క్రీ.పూ.300 సమయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి చెందిన ఊరేగింపు రథం అగ్నికి ఆహుతి అయింది.
 
దీనిపై ఆయన స్పందిస్తూ, రథం కాలిపోయిన విధానాన్ని నిశితంగా పరిశీలిస్తే ఈ అనుమానం కలుగుతోందన్నారు. కింది నుంచి పైదాకా ఒకేసారి ఈ రథం తగులబడటం అనుమానాస్పదంగా ఉందన్నారు. ఒకవేళ కరెంటు షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి ఉంటే ఈ రకంగా రథం పూర్తిగా బూడిదయ్యే అవకాశం లేదన్నారు. 
 
'గతంలో కొన్ని చోట్ల ఇలాగే జరిగితే ఎవరో పిచ్చివాళ్లు చేశారని ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా ఎవరో పిచ్చివారి పిచ్చిచేష్ఠగానే ముద్రవేసి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఈ ఘటన చూస్తుంటే... కావాలని ఒక మతంపై జరిగిన దాడిలా అనిపిస్తోంది. మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ కేవలం ప్రకటనతోనే సరిపెట్టుకోకుండా దోషులను పట్టుకుని, కఠినంగా శిక్షించాలి' అని డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments