Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు భద్రత పెంచండి... కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (13:04 IST)
తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైకాపా నేతలు దాడికి ప్రయత్నించారని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లాకు తెదేపా ఎంపీ కనకమేడల ఫిర్యాదు చేశారు. జడ్ ప్లస్ క్యాటగిరీ ఉన్న నేతపైనే దాడికి ప్రయత్నించారని ఆ లేఖలో పేర్కొన్నారు. 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌రిగిన ఈ ఘటనలో శాంతి భద్రతల వైఫల్యం కనిపించిందని, దాడి ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖని కోరారు. చంద్రబాబుకు మరింత భద్రతను పెంచాలని ప్రస్తావించారు. ఈ మేరకు దాడి ఘటన ఆధారాలను హోంశాఖ కార్యదర్శికి అందించారు. 
 
ఈ సందర్భంగా ఎంపీ కనకమేడల ర‌వీంద్ర‌బాబు మాట్లాడుతూ, చంద్రబాబు ఇంటిపై దాడి జరిగినా ఎవరిపైనా కేసు పెట్టలేద‌ని, ఉల్టా తెదేపా నేతలు, కార్యకర్తలపైనే కేసులు నమోదు చేశార‌ని పేర్కొన్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే, ఈ ఘటన జరిగిందని వివరించారు. పూర్తి వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా తెలిపార‌ని క‌న‌క‌మేడ‌ల వివ‌రించారు. ఈ దాడి బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే న్యాయపోరాటం చేస్తామ‌ని, ప్రధాని, హోం మంత్రిని కలిసి రాష్ట్రంలో పరిస్థితిని వివరిస్తామ‌ని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments