Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్... సీబీఐ తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వండి... కోర్టుకు అవినాశ్ రెడ్డి

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (08:33 IST)
వైకాపా నేత, మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడుకు కళ్లెం వేయాలంటూ ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ, వైకాపా నేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వరుసకు తమ్ముడు అయ్యే వైఎస్ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ తన పట్ల అరెస్టు వంటి తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. 
 
వివేకా హత్య కేసులో మరోమారు విచారణకు రావాలంటూ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీచేసింది. ఈ నోటీసుల్లో ఆరో తేదీన హైదరాబాద్ నగరంలోని తమ సీబీఐ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించింది. అయితే, ఆ రోజున వేరే కార్యక్రమాలు ఉన్నాయని, అందువల్ల హాజరుకాలేనని బదులిచ్చారు. దీంతో 10వ తేదీన రావాలంటూ మరోమారు నోటీసులిచ్చింది. ఈ క్రమంలో ఆయన శుక్రవారం సీబీఐ విచారణకు హాజరుకావాల్సివుది. 
 
ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన విచారణకు న్యాయవాదిని కూడా అనుమతించాలని, విచారణ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డ్ చేసేలా సీబీఐని అదేశించాలని కోరుతూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సీబీఐ దూకుడుకు కళ్లెం వేయాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐ నమోదు చేసిన వాంగ్మూలం కాపీని ఇచ్చేలా ఆదేశించాలని కూడా అవినాశ్ రెడ్డి తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments