Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలపై శానిటైజర్ పోసింది నిప్పంటించి.. తాను కూడా ఆత్మహత్య..?

Webdunia
శనివారం, 24 ఏప్రియల్ 2021 (15:52 IST)
తన ఇద్దరు చిన్నారులకు నిప్పంటించి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నెల్లూరుపాలెంలో చోటుచేసుకుంది. ఆత్మకూరు సీఐ సోమయ్య, ఎస్సై రవినాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరుపాలెంకు చెందిన సుబ్బులు తన ఇద్దరు చిన్నారులతో కలిసి కర్ణాటకలోని బళ్లారి వద్ద వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తోంది. గురువారం బళ్లారి నుంచి ఈమె తన ఇద్దరు పిల్లలతో బయలుదేరింది. 
 
శుక్రవారం తెల్లవారుజామున నెల్లూరుపాలెం వద్ద దిగింది. గ్రామానికి వెళ్లే మార్గంలోఉన్న శ్మశాన వాటిక స్థలంలో తనతో పాటు పిల్లలపై శానిటైజర్ పోసి నిప్పంటించుకుంది. ఈ ప్రమాదంలో సుబ్బులు, కుమార్తె మధురవాణి(5) అక్కడికక్కడే మృతిచెందారు. 
 
కుమారుడు మహేశ్ మంటల వేడికి తప్పించుకొని పరిగెత్తడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మహేశ్ గ్రామంలోకి వెళ్లి చెప్పడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments