Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో మంకీ ఫాక్స్ కలకలం.. ఒంటిపై దద్దుర్లతో ఎనిమిదేళ్ల బాలుడు?

Webdunia
శనివారం, 30 జులై 2022 (15:05 IST)
దేశాన్ని కరోనా వైరస్ ఇంకా వీడలేదు. ఇది చాలదన్నట్లు ప్రస్తుతం మంకీ ఫాక్స్ కోరలు చాచుతోంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ, కేరళలో పలు కేసులు నమోదయ్యాయి. 
 
ఇతర రాష్ట్రాలతో పాటు తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనూ అలజడి సృష్టిస్తోంది. తాజాగా ఖమ్మంలో ఓ అనుమానిత కేసు నమోదవ్వడం కలకలం రేపింది. ఇప్పుడు గుంటూరులోనూ ఓ అనుమానిత కేసు వెలుగుచూసింది.
 
ఒంటిపై దద్దుర్లతో ఎనిమిదేళ్ల బాలుడు గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి(జీజీహెచ్‌)లో చేరాడు. రెండు వారాల క్రితమే జీజీహెచ్‌కు బాలుడ్ని తల్లిదండ్రులు తీసుకొచ్చారు. ఒంటిపై దద్దుర్లు ఉండడంతో.. మంకీ పాక్స్‌గా వైద్యులు అనుమానిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలోనే శాంపిల్‌ను సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి జీజీహెచ్ అధికారులు పంపించారు. రిపోర్ట్ ఆధారంగా తదుపరి కార్యచరణ ఉంటుందని అధికారులు తెలిపారు. 
 
ప్రస్తుతం బాలుడ్ని ఓ ప్రత్యేక వార్డులో ఉంచి, చికిత్స అందిస్తున్నారు. కాగా.. బాలుడి తల్లిదండ్రులు ఒడిశాకి చెందినవారు. ఉపాధి కోసం పల్నాడుకి వచ్చారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments