Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వానరానికి కోపం వచ్చింది.. ఏం చేసిందో తెలుసా?

ఆ వానరం చేసిన చేష్టలకు అందరూ జడుసుకున్నారు. తనకు తినేందుకు ఏమీ దొరకలేదనే కోపంతో కోతి చేసిన పిచ్చి చేష్టలు.. ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. ఇంతకీ ఆ కోతి ఏం చేసిందంటే.. గోదావరి ఖని సమీపంలోని సెంటినరీ

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (11:07 IST)
ఆ వానరం చేసిన చేష్టలకు అందరూ జడుసుకున్నారు. తనకు తినేందుకు ఏమీ దొరకలేదనే కోపంతో కోతి చేసిన పిచ్చి చేష్టలు.. ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. ఇంతకీ ఆ కోతి ఏం చేసిందంటే.. గోదావరి ఖని సమీపంలోని సెంటినరీ కాలనీలో జనగామ వెంకటేశ్ అనే యువకుడు కొన్ని తినుబండారాలను తీసుకుని వెళుతుండగా, ఓ కోతి వాటిని లాక్కోబోయింది. దీంతో వెంకటేష్ పక్కనే ఉన్న ఓ కర్రను తీసుకుని దాన్ని బెదిరించాడు. అంతే కోతికి కోపం వచ్చేసింది. 
 
పక్కనే వున్న పొయ్యిలో మండుతున్న కర్రను అందుకుని.. పక్కనే వున్న తాటిచెట్టు ఎక్కింది. దీంతో తాటికొమ్మలకు మంటలు అంటుకుని, పక్కనున్న చెట్లకు మంటలు వ్యాపించాయి. తొలుత పిడుగు పడి చెట్లు కాలుతున్నాయని అక్కడి వారు భావించారు. దీంతో అవి ఎక్కడ ఇళ్లపై పడతాయోనని గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. 
 
ఆపై మంటలు చెట్ల వరకూ మాత్రమే పరిమితం కావడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంత పనిచేసిన ఆ కోతి ఓ కుర్రును పట్టుకుని తాటిచెట్టు కిందనే కూర్చుని వుండిపోయింది. దీన్ని చూసిన గ్రామస్థులంతా షాక్ తిన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments