Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ అక్రమాస్తులు : రూ.170 కోట్ల నగదు డిపాజిట్లు ఈడీ ఖాతాకు బదిలీ

వైకాపా అధినేత, ఏపీ అసెంబ్లీ విపక్షనేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు చెందిన 170 కోట్ల రూపాయల నగదు డిపాజిట్లను ఎన్‌‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకుంది. వీటిని

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2016 (09:21 IST)
వైకాపా అధినేత, ఏపీ అసెంబ్లీ విపక్షనేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు చెందిన 170 కోట్ల రూపాయల నగదు డిపాజిట్లను ఎన్‌‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకుంది. వీటిని తన ఖాతాలోకి మళ్లించుకుంది. జగన్‌ అక్రమాస్తుల కేసులో 2014 నుంచి పలు దఫాలుగా ఈడీ ఆయన కంపెనీలకు చెందిన స్థిర, చరాస్తులను జప్తు (అటాచ్‌మెంట్‌) చేసుకున్న విషయం తెల్సిందే. వీటి మొత్తం విలువ రూ.2524 కోట్లు. ఇందులో భారతీ సిమెంట్స్‌కు చెందిన రూ.170 కోట్ల విలువైన బ్యాంకు డిపాజిట్లు, షేర్లు ఉన్నాయి. 
 
వాటన్నింటినీ తమ అకౌంట్‌లోకి బదిలీ చేస్తున్నట్లు కొద్ది రోజుల కిందటే జగన్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం సాయంత్రం సొత్తు స్వాధీనం ప్రక్రియను పూర్తి చేసింది. వాస్తవానికి ఈడీ అటాచ్‌మెంట్‌ చేసినప్పటికీ ఆస్తులన్నీ ఆయా కంపెనీల పేరిటే ఉంటాయి. వాటిపై లావాదేవీలను కూడా నిర్వహించరాదు. రూ.170 కోట్ల నిల్వల పరిస్థితి కూడా అంతే. కానీ, అసాధారణ రీతిలో రూ.170 కోట్ల ఎఫ్‌డీలు, షేర్లను ఈడీ తన ఖాతాల్లోకి మళ్లించుకోవడం గమనార్హం. 
 
ఈ విషయం తెలుసుకున్న వెంటనే జగన్ తన న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపారు. భారతీ సిమెంట్‌ కంపెనీ తరఫు న్యాయవాదులు శనివారం హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ వేశారు. అయితే, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ శనివారం అందుబాటులో లేరు. ఆయన విశాఖపట్నంలో ఉండటంతో... హౌస్‌ మోషన్‌ పిటిషన్‌కు అనుమతి లభించలేదు. దీంతో వాజ్యం సోమవారం హైకోర్టులో రెగ్యులర్‌ మోషన్‌లో విచారణకు రానుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments