Webdunia - Bharat's app for daily news and videos

Install App

''టైమ్స్ నౌ'' ప్రతినిధిని వెళ్లిపోవాలంటూ... మోహన్ బాబు ఆర్డర్!

Webdunia
బుధవారం, 4 మార్చి 2015 (17:27 IST)
కలెక్షన్ కింగ్, నిర్మాత మోహన్ బాబు మరోసారి ఆగ్రహంతో ఊగిపోయారు. సాక్షాత్తు కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే సమక్షంలో తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. వివరాల్లోకి వెళ్తే, తన చిన్న కుమారుడు మనోజ్, ప్రణతి రెడ్డిల నిశ్చితార్థం బుధవారం పార్క్ హయత్ హోటల్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర మాజీ మంత్రి షిండే కూడా విచ్చేశారు. 
 
ఈ సందర్భంగా, షిండేతో మాట్లాడటానికి జాతీయ ఛానల్ 'టైమ్స్ నౌ'కు చెందిన ప్రతినిధి ప్రయత్నించారు. అయితే, ప్రస్తుతం అలాంటివి వద్దని మోహన్ బాబు సూచించారు. అయినా, సదరు విలేకరి షిండేతో మాట్లాడేందుకు ప్రయత్నించడంతో మోహన్ బాబు ఫైర్ అయ్యారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ఆదేశించారు. ఓవైపు షిండే వారిస్తున్నప్పటికీ మోహన్ బాబు మాత్రం చల్లారలేదు.

మరోవైపు టైమ్స్ నౌ తన ట్విట్టర్లో ఇలా పోస్ట్ చేసింది... "Shinde threatens, Telugu actor Mohan Babu assaults TIMES NOW reporter when asked on Nirbhaya documentary #NirbhayaInsulted''

ఈ వివాదం ఏ మేరకు దారితీస్తుందో.. వేచి చూడాలి. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments