Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరాడంబరంగా గవర్నర్ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుక: శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి జగన్, భారతి

Webdunia
బుధవారం, 7 జులై 2021 (22:11 IST)
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతుల 56వ వివాహ వార్షికోత్సవ వేడుక విజయవాడ రాజ్ భవన్ లో బుధవారం జరిగింది. కరోనా నేపధ్యంలో అతి నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి అతిధులు, ఆహ్వానితులను అంగీకరించలేదు. కేవలం రాజ్ భవన్ ఉన్నతాదికారులు మాత్రమే గవర్నర్ దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు గవర్నర్ దంపతులకు మెమోంటోను బహుకరించారు.
 
అలనాటి వివాహ వేడుక జ్ఞాపకాలను ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు గుర్తు చేసుకున్నారు. వివాహా వార్షికోత్సవ వేడుక నేపధ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సతీమణి భారతి రెడ్డి దంపతులు బిశ్వభూషన్ హరిచందన్ దంపతులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా చరవాణిలో మాట్టాడిన ముఖ్యమంత్రి దంపతులు మరెన్నో వార్షికోత్సవ వేడుకలు ఆనందమయంగా జరపుకోవాలని అభిలషించారు. ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

వార్ 2 కథను రూపొందించటానికి చాలా సమయం పట్టింది - అయాన్ ముఖర్జీ

కుబేర, థియేటర్లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఉద్వేగానికి లోనైన ధనుష్ (video)

Kubera: ఆసక్తి కలిగిస్తూ, ఆలోచింపజేసేదిగా కుబేర చిత్రం - కుబేర ఫుల్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments