Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరాడంబరంగా గవర్నర్ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుక: శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి జగన్, భారతి

Webdunia
బుధవారం, 7 జులై 2021 (22:11 IST)
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతుల 56వ వివాహ వార్షికోత్సవ వేడుక విజయవాడ రాజ్ భవన్ లో బుధవారం జరిగింది. కరోనా నేపధ్యంలో అతి నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి అతిధులు, ఆహ్వానితులను అంగీకరించలేదు. కేవలం రాజ్ భవన్ ఉన్నతాదికారులు మాత్రమే గవర్నర్ దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు గవర్నర్ దంపతులకు మెమోంటోను బహుకరించారు.
 
అలనాటి వివాహ వేడుక జ్ఞాపకాలను ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు గుర్తు చేసుకున్నారు. వివాహా వార్షికోత్సవ వేడుక నేపధ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సతీమణి భారతి రెడ్డి దంపతులు బిశ్వభూషన్ హరిచందన్ దంపతులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా చరవాణిలో మాట్టాడిన ముఖ్యమంత్రి దంపతులు మరెన్నో వార్షికోత్సవ వేడుకలు ఆనందమయంగా జరపుకోవాలని అభిలషించారు. ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments