Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కారుమబ్బులు: కుమ్మేస్తున్న వర్షాలు, మరో రెండు రోజులు...

Webdunia
గురువారం, 13 జనవరి 2022 (14:17 IST)
ఏపీలో ఉదయాన్నే కారుమేఘాలు కమ్ముకున్నాయి. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.

 
నైరుతి బంగాళాఖాతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో దక్షిణ, ఆగ్నేయ గాలులు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

 
కోస్తాంధ్ర జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని, గురువారం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాయలసీమలో గురు, శుక్రవారాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, గుంటూరు జిల్లా గురజాల, దాచేపల్లి, మాచవరం మండలాలతో పాటు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, మార్కాపురం, దోర్నాల మండలాల్లో బుధవారం వర్షం కురిసింది.

 
ఈ అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు, కొన్ని జిల్లాల్లో వరి కుప్పలు పొలాల్లోనే ఉండిపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments