Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్సీ కరీమున్నీసా ఆకస్మిక మృతి...నిన్న అసెంబ్లీకి వ‌చ్చి...

Webdunia
శనివారం, 20 నవంబరు 2021 (10:06 IST)
ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా అక‌స్మాత్తుగా మృతి చెందారు. ఆమె వ‌య‌సు 65 సంవ‌త్స‌రాలు.  శుక్రవారం రాత్రి ఆమె గుండె పోటుతో మృతి చెందారు. శుక్ర‌వారం ఉద‌యం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆమె రాత్రి అస్వస్థతకు గురికావడంతో నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అక్క‌డ కరీమున్నీసా చికిత్స పొందుతూ మృతి చెందారు. కరీమున్నీసాకు భర్త, ఐదుగురు కుమారులు ఉన్నారు.
 
 
వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి కరీమున్నీసా పార్టీకోసం నిరంతరం శ్రమించారు. ఈ ఏడాది ఎమ్మెల్సీగా ఆమెకు సీఎం జగన్‌ అవకాశం కల్పించారు. శుక్రవారం ఉదయం శాసనమండలిలో ఆమె సీఎం జగన్‌, శాసన మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజును కలిశారు. 
 
 
గతంలో విజ‌య‌వాడ‌లోని 54వ డివిజన్ కార్పొరేటర్ గా ప‌నిచేసిన ఆమెకు ముస్లిం మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా హఠాన్మరణంపై  ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిన్న ఉదయం శాసన మండలి సమావేశాలకు హాజరైన ఆమె రాత్రి అస్వస్థతకు గురి కావడం, గుండె పోటుతో మరణించడం త‌న‌ను క‌ల‌చివేసింద‌ని ముఖ్యమంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.


విజయవాడలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ప్రతిభావంతమైన నాయకురాలిగా, కార్పొరేటర్ నుంచి మండలి సభ్యురాలిగా ఎదిగిన కరీమున్నీసా మరణం ఊహించనిదని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments