Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు డిగ్రీ చదివారా? అయితే ఓటుకు వెయ్యి...!.. ఎక్కడ?

మీరు వింటున్నది నిజమే. ఇది ఎక్కడో కాదు.. రాయలసీమ జిల్లాల్లో జరుగుతున్న తతంగం. ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో పట్టభద్రుల స్థానంలో గెలిచేందుకు రాజకీయ పార్టీలు చేస్తున్న హడావిడి అంతా ఇంతా

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (14:01 IST)
మీరు వింటున్నది నిజమే. ఇది ఎక్కడో కాదు.. రాయలసీమ జిల్లాల్లో జరుగుతున్న తతంగం. ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో పట్టభద్రుల స్థానంలో గెలిచేందుకు రాజకీయ పార్టీలు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఇప్పటికే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైకాపాలు పోటీలు పడి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలన్న పట్టుదలతో ఉన్నాయి. ప్రధానంగా అందులో పట్టభద్రుల విషయంలోనే ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు. 
 
రాయలసీమలో ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా పైరవీలు కొనసాగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఓటుకు వెయ్యి. డిగ్రీ చదివి పట్టభద్రుల ఎమ్మెల్సీల్లో ఓటు వేసేందుకు ధరఖాస్తు చేసుకొని ఉంటే ఇక వెయ్యి రూపాయలు మీదే. అది పార్టీ పరిస్థితి. వెయ్యి నుంచి 1500 రూపాయలు కూడా ఇవ్వడానికి రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయట. 
 
ఇది ఒక్క చిత్తూరు జిల్లాలోనే కాదు రాయలసీమ జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనబడుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న తపనలో తెలుగుదేశం పార్టీ ఉంటే మరోవైపు అధికార పార్టీని ఓడించాలన్న లక్ష్యంతో విపక్ష పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇద్దరూ ఇద్దరుగానే పోటీలు పడుతూ ఓటర్లకు డబ్బులు ముట్టజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీరి గొడవ ఎలాగున్నా ప్రస్తుతం బాగా లాభపడుతున్నది డిగ్రీ చదివిన పట్టభద్ర ఓటర్లు మాత్రమే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments