Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు,లోకేష్‌ హైదరాబాద్‌కు వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (15:27 IST)
మహిళలకు ప్రతి దశలోనూ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రోజా అన్నారు. అసెంబ్లీ సమావేశంలో భాగంగా మహిళా సాధికారతపై ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ, జగనన్న ప్రభుత్వం.. మహిళా పక్షపాతి ప్రభుత్వమని తెలిపారు. మహిళల కోసం ​ఇన్ని పథకాలు తెచ్చిన ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌ అని పేర్కొన్నారు. అదేవిధంగా మహిళల ఖాతాల్లోకి నగదు చేరేలా పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. 
 
 
దేశంలోనే గొప్ప పథకం అమ్మ ఒడి అని కొనియాడారు. రాష్ట్రంలో ఎంతమంది నాయకులున్నా, జగనన్నకు సాటిరారని తెలిపారు. అమ్మ జన్మనిస్తే, జగనన్న జీవితాన్నిచ్చాడని ఎమ్మెల్యే రోజా అన్నారు. మహిళల తలరాతను మార్చే పథకాలు అమలు చేస్తున్నారని రోజా పేర్కొన్నారు.  65 శాతం మంది మహిళలకు మున్సిపల్‌​ చైర్మన్ల పదవులు, ఎంపీపీ పదవుల్లో 53 శాతం మహిళలకే కేటాయించారని రోజా తెలిపారు. చం‍ద్రబాబు మహిళా ద్రోహి అని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. 
 

కుప్పంలో చం‍ద్రబాబును ప్రజలు ఛీకొట్టారని ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు ఆడవాళ్లను అవమాన పరిచారని రోజా గుర్తు చేశారు. 40 ఏళ్ల నుంచి బాబు ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు, లోకేష్‌ వీధి రౌడీల్లాగా వ్యవహరించారని, గల్లీ గల్లీ తిరిగినా ప్రజలు పట్టించుకోలేదన్నారు. తట్టాబుట్టా సర్దుకుని చంద్రబాబు,లోకేష్‌ హైదరాబాద్‌కు వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని రోజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments