Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజమ్మకు కోపమొచ్చింది, అసలేమైంది?

Webdunia
మంగళవారం, 18 మే 2021 (16:43 IST)
చిత్తూరు జిల్లా పుత్తూరులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్ట 500 మీటర్ల మేర పగుళ్ళు ఏర్పడినట్లు ఈ రోజు గుర్తించారు. దీంతో ఎప్పుడు ఏమవుతుందోనని స్థానికులు భయాందోళనలో ఉన్నారు. 
 
విషయం తెలుసుకున్న నగరి ఎమ్మెల్యే రోజా అధికారులతో మాట్లాడారు. వెంటనే కట్ట పగుళ్ళు పూడ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 2006లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను నిర్మించారు. నాణ్యత లేకుండా గతంలో దీన్ని నిర్మించారని రోజా ఆరోపిస్తున్నారు.
 
కాంట్రాక్టర్ దీన్ని గతంలో సరిగ్గా కట్టలేదని రోజా చెబుతూనే ఉన్నారు. దీంతో ఉన్నట్లుండి సమ్మర్ స్టోరేజ్ నుంచి పగుళ్ళు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని రోజా చెప్పారు. చెరువులో మధ్యలోనే ఈ ట్యాంక్‌ను నిర్మించారని.. దీనివల్ల ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతాయంటున్నారు.
 
గతంలో తను ఎన్నోసార్లు చెప్పానని అధికారుల దృష్టికి రోజా తీసుకెళ్ళారు. నగరం మధ్యలో ఉండటంతో త్వరగా ఈ పనులను పూర్తి చేసి స్థానికుల్లో భయాందోళన పోగొట్టుకోవాలని కోరారు. అంతేకాకుండా కాంట్రాక్టర్ పైన కేసు కూడా పెట్టాలన్నారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాంట్రాక్టర్ తినేశాడంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments