రోజమ్మకు కోపమొచ్చింది, అసలేమైంది?

Webdunia
మంగళవారం, 18 మే 2021 (16:43 IST)
చిత్తూరు జిల్లా పుత్తూరులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్ట 500 మీటర్ల మేర పగుళ్ళు ఏర్పడినట్లు ఈ రోజు గుర్తించారు. దీంతో ఎప్పుడు ఏమవుతుందోనని స్థానికులు భయాందోళనలో ఉన్నారు. 
 
విషయం తెలుసుకున్న నగరి ఎమ్మెల్యే రోజా అధికారులతో మాట్లాడారు. వెంటనే కట్ట పగుళ్ళు పూడ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 2006లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను నిర్మించారు. నాణ్యత లేకుండా గతంలో దీన్ని నిర్మించారని రోజా ఆరోపిస్తున్నారు.
 
కాంట్రాక్టర్ దీన్ని గతంలో సరిగ్గా కట్టలేదని రోజా చెబుతూనే ఉన్నారు. దీంతో ఉన్నట్లుండి సమ్మర్ స్టోరేజ్ నుంచి పగుళ్ళు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని రోజా చెప్పారు. చెరువులో మధ్యలోనే ఈ ట్యాంక్‌ను నిర్మించారని.. దీనివల్ల ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతాయంటున్నారు.
 
గతంలో తను ఎన్నోసార్లు చెప్పానని అధికారుల దృష్టికి రోజా తీసుకెళ్ళారు. నగరం మధ్యలో ఉండటంతో త్వరగా ఈ పనులను పూర్తి చేసి స్థానికుల్లో భయాందోళన పోగొట్టుకోవాలని కోరారు. అంతేకాకుండా కాంట్రాక్టర్ పైన కేసు కూడా పెట్టాలన్నారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాంట్రాక్టర్ తినేశాడంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments