Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మ!.. ఆ ఎమ్మెల్యే దేవినేని ఉమని ఎంత మాటనేశాడు?

Webdunia
శనివారం, 9 నవంబరు 2019 (07:28 IST)
మాజీ మంత్రి దేవినేని ఉమాకు మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు సవాల్ విసిరారు.  మైలవరం వ్యవసాయ మార్కెట్ కమిటి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు మాట్లాడుతూ.. నాకు లారీలు గాని ఇసుక వ్యాపారంలో వాటాలు ఉన్నట్లు గాని నిరూపిస్తే దేనికైనా సిద్ధమే. నీకు దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. 
 
"నేను అగర్బశ్రీమంతుడనని ఎప్పుడైనా చెప్పానా? నీలా పిచ్చి పిచ్చిగా వాగే అలవాటు నాకు లేదు. ఈడి కేసులు ముద్దాయిలు అంటూ మతిలేని మాటలు మానుకో. నాకు నీలా పదవులు పిచ్చి లేదు. ప్రజా తీర్పు కోసం ఎదురు చూస్తూ ప్రజల కోసం నీతి నిజాయితీగా పనిచేస్తున్నాను. 
 
నీలా ఇసుక, నీరు- చెట్టు మైనింగ్ మాఫియా లీడర్ గా నేను రాలేదు. మైలవరంలో నీ గ్యాంగ్ దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయింది. అందుకే ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, నీ బుద్ధి మార్చకో. లేకపోతే నీకు తగిన గుణపాఠం నేను చెబుతాను" అని అన్నారు. 
 
"నీకు బురదగుంటలో పొర్లాడే పందికి పెద్ద తేడా లేదు తెలుసుకో. మతిలేని మాటలు మానుకొకపోతే నేరుగా వచ్చి నీ సంగతి తేల్చుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మైలవరం నియోజకవర్గంలో దోపిడీ లక్ష్యంగా నీవు పని చేశావు. అభివృద్ధి ధ్యేయంగా నేను పనిచేస్తున్నాను. 
 
దేవినేని ఉమా! పిచ్చి వాగుడు మానుకో. లేకపోతే ప్రజా క్షేత్రంలో నీకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా" అంటూ సవాల్ విసిరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments