Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.. మరోవైపు ఎండలే ఎండలు

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (11:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. ఒకవైపు పగటిపూట ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మరోవైపు వచ్చే మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ ఉప కేంద్రం తెలిపింది. ఈ వర్షాలకుతోడు ఉష్ణోగ్రతల్లోనూ పెరుగుదల కనిపిస్తుందని తెలిపారు. ఈ భిన్న వాతావరణ పరిస్థితుల కారణంగా 60 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. మరోవైపు, బంగాళాఖాతంలో కేంద్రీకృతమైవున్న మోకా తుఫాను ఈ నెల 14వ తేదీన తీరం దాటుతుందని తెలిపింది.

మోకా తుఫాను ఈ నెల 14వ తేదీన ఆగ్నేయ బంగ్లాదేశ్, ఉత్తర మయన్మనార్‌ మధ్యలో కాక్స్ బజార్ వద్ద తీరం దాటి అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర ఈశాన్య దిశగా కదిలిన మోకా.. గత రాత్రి తీవ్ర తుఫానుగా మారింది. శుక్రవారం మధ్య బంగాళాఖాతంలో అత్యంత తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments