Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.. మరోవైపు ఎండలే ఎండలు

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (11:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. ఒకవైపు పగటిపూట ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మరోవైపు వచ్చే మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ ఉప కేంద్రం తెలిపింది. ఈ వర్షాలకుతోడు ఉష్ణోగ్రతల్లోనూ పెరుగుదల కనిపిస్తుందని తెలిపారు. ఈ భిన్న వాతావరణ పరిస్థితుల కారణంగా 60 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. మరోవైపు, బంగాళాఖాతంలో కేంద్రీకృతమైవున్న మోకా తుఫాను ఈ నెల 14వ తేదీన తీరం దాటుతుందని తెలిపింది.

మోకా తుఫాను ఈ నెల 14వ తేదీన ఆగ్నేయ బంగ్లాదేశ్, ఉత్తర మయన్మనార్‌ మధ్యలో కాక్స్ బజార్ వద్ద తీరం దాటి అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర ఈశాన్య దిశగా కదిలిన మోకా.. గత రాత్రి తీవ్ర తుఫానుగా మారింది. శుక్రవారం మధ్య బంగాళాఖాతంలో అత్యంత తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments