Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాలెట్ పత్రాల్లో తప్పులు.. నిలిచిన పోలింగ్..ఎక్కడ?

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (08:29 IST)
గుంటూరు జిల్లాలోని గురజాల మండలం మాడుగులలో బ్యాలెట్ పత్రాల్లో తప్పులు రావడంతో పోలింగ్ నిలిచిపోయింది. ఇద్దరు అభ్యర్థులకు అధికారులు ఒకే గుర్తు ముద్రించారు.

దీంతో 12, 13 వార్డుల్లో పోలింగ్ నిలిచిపోయింది. తిరిగి ఈనెల 21న మాడుగులలో పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 
 
ఓటు వేయ కుంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారా?
ఓటు వేయ కుంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారా? ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని బెదిరిస్తారా.. అని పాలకులపై టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు.

నరసరావుపేట నియోజకవర్గం గోగులపాడు పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారనే కక్షతో ఇస్సపాలెంలో ఇళ్లలోకి వెళ్లే మెట్లు, ఇతర నిర్మాణాలను ధ్వంసం చేసిన ప్రదేశాన్ని టీడీపీ ఉన్నత స్థాయి కమిటీ సందర్శించి బాధితులను పరామర్శించింది. జరిగిన సంఘటనను కమిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు.

అనంతరం వర్ల రమయ్య మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పని చేశారని ఇలా నిర్మాణాలు కూల్చివేయడం దారుణమన్నారు. ఇలాంటి సంఘటనలపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. నరసరావుపేట ఎమ్మెల్యే పేరుకే డాక్టర్‌ అని, ఆయనకు మానవత్వం లేదని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments