Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారి గొయ్యి వారే తవ్వుకున్నారు...! మంత్రి రావెల

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (06:15 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్‌లు ఫోన్ ట్యాపింగ్ అంశంలో వారి గొయ్యి వారే తవ్వుకున్నారని ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు ఘాటుగా స్పందించారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్, కేసీఆర్ కుట్ర పన్నారని ఆరోపించారు. 
 
గురువారం ఆయన మట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధి జరిగితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ గెలుస్తుందని కేసీఆర్‌కు భయం ఆవహించిందని, రాష్ట్రం అభివృద్ధి చెందితే రాజకీయ భవిష్యత్ ఉండదని జగన్‌కు భయం పట్టుకుందని అన్నారు. సర్వీస్ ప్రొవైడర్లు కోర్టుకు ఇచ్చిన నివేదికతో జగన్‌లోనూ, కేసీఆర్‌లోనూ భయం నెలకొందని తెలిపారు. 
 
కుట్ర ఫలితంగా జగన్, కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోబోతున్నారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కారణంగా తెలంగాణ ప్రభుత్వం కుప్పకూలిపోబోతోందన్నారు. జగన్, కేసీఆర్ తమ గొయ్యి తామే తవ్వుకున్నారని రావెల ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments