Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు వంశాన్ని ఉద్ధరిస్తారని భావిస్తే ఇలా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు : జేసీ దివాకర్

పిల్లలు తమ వంశాన్ని ఉద్ధరిస్తారని భావిస్తో ఇలా రోడ్డు ప్రమాదాల్లో అర్థాంతరంగా చనిపోతున్నారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తలు జీర్ణించుకోలేమన్నారు. పైగా, ధనవంతుల పి

Webdunia
బుధవారం, 10 మే 2017 (15:40 IST)
పిల్లలు తమ వంశాన్ని ఉద్ధరిస్తారని భావిస్తో ఇలా రోడ్డు ప్రమాదాల్లో అర్థాంతరంగా చనిపోతున్నారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తలు జీర్ణించుకోలేమన్నారు. పైగా, ధనవంతుల పిల్లల్లో విచ్చలవిడితనం పెరిగిపోతుందన్నారు. 
 
ఏపీ మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ, అతని స్నేహితుడు రాజా రవివర్మలు బుధవారం వేకువజామున హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెల్సిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ... ధనవంతుల పిల్లల్లో విచ్చలవిడితనం పెరిగిందని అన్నారు. ధనవంతుల పిల్లలు పబ్బులు, బార్లకు వెళ్తున్నారని ఆయన ఆక్షేపించారు. 
 
రాత్రి 11 గంటల్లోపు పబ్బులు, బార్లు మూసేయాలని ఆయన డిమాండ్ చేశారు. యువకులు తమ వంశాన్ని ఉద్దరిస్తారని భావిస్తే ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారన్న వార్త జీర్ణించుకోవడం కష్టమన్నారు. యువకులు జాగ్రత్తగా ఉండాలని, అందుకు తల్లిదండ్రులు బాధ్యతలు తీసుకోవాలని ఆయన సూచించారు.
 
'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సినిమా పనుల్లో బిజీగా ఉన్న చిరంజీవి... మంత్రి నారాయణ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలియగానే ఆసుపత్రికి చేరుకొని విచారం వ్యక్తం చేశారు. పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదన్నారు. ఈ సందర్భంగా నారాయణ కుటుంబ సభ్యలను ఆయన ఓదార్చారు. ఎంతో భవిష్యత్ చూడాల్సిన పిల్లాడ్ని ఇలా చూడాల్సి రావడం బాధాకరమన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments