Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ టీచర్లు అనుకుంటే ప్రైవేట్ స్కూల్స్ మూతపడతాయ్: నారా లోకేష్ (video)

సెల్వి
సోమవారం, 11 నవంబరు 2024 (22:02 IST)
Nara lokesh
విద్యా వ్యవస్థల్లో ఇతర శాఖల్లో తీసుకున్నట్లు నిర్ణయాలు తీసుకునే ప్రసక్తే వుండదని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. మనం తీసుకునే నిర్ణయం లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడివుంది. అన్ని వ్యవస్థల్ని నాశనం చేసినట్టే గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. జీఓ117 తీసుకొచ్చి స్కూల్స్ మూసేశారని.. ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చెయ్యలేదని ఆరోపించారు. జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. "గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 4 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యా వ్యవస్థను గాడిన పెడతాం. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చెయ్యడమే నా ఎజెండా. కేజీ టూ పీజీ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను. 
 
ఐదేళ్లలో అందరూ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకునే విధంగా చేస్తాను. క్లాస్‌కి ఒక టీచర్ ఖచ్చితంగా ఉండాలనేది నా లక్ష్యం. ప్రభుత్వ టీచర్లు అనుకుంటే ప్రైవేటు స్కూళ్లూ మూతపడతాయి. మీలో కమిట్‌మెంట్ ఉంది. ఏం ఇబ్బంది ఉన్నా అండగా నిలబడే ప్రభుత్వం ఉంది" అంటూ నారా లోకేష్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Miheeka : పెళ్ళీడుకొచ్చిన శ్రీలీలకు మిహీక రానా శుభాకాంక్షలు

ద్విభాషా చిత్రంలో కీలక పాత్రలో అమ్ము అభిరామి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments