Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే ఓ మంచి ముహూర్తాన విశాఖ నుంచి పాలన : మంత్రి అమర్నాథ్

Webdunia
ఆదివారం, 27 నవంబరు 2022 (10:07 IST)
ఓ మంచి ముహూర్తాన త్వరలోనే విశాఖపట్టణం నుంచి రాష్ట్ర పాలన ప్రారంభమవుతుందని ఏపీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టి ఆమోదిస్తామని తెలిపారు. పైగా, రాష్ట్రంలో మూడు రాజధానులకు అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజల మద్దతు ఉందని ఆయన అన్నారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలోనే విశాఖ నుంచి పాలన సాగిస్తారని చెప్పారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు పెడతామన్నారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు. మూడు రాజధానులకు అందరి మద్దతు ఉందని, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మూడు రాజధానులకు అనుకూలంగా తీర్మానాలు చేశారని చెప్పారు. 
 
ఇకపోతే రాష్ట్రంలో ఏ సమస్య ఉందని టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. పాదయాత్ర పేటెంట్ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానిదేనని, యాత్రల ద్వారా వారు ప్రజల్లో భరోసా నింపారని మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments