Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే మాజీ ఈవో... మాజీ ఐఏఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్ కన్నుమూత

మాజీ ఐఏఎస్ అధికారి, టీటీడీ మాజీ ఈవో, ప్రముఖ రచయిత పీవీఆర్కే ప్రసాద్ మృతిచెందారు. ఆయన వయసు 77 యేళ్లు. అనారోగ్యంతో హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ గుండెపోటుతో సోమవారం తెల్లవారుజ

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2017 (10:02 IST)
మాజీ ఐఏఎస్ అధికారి, టీటీడీ మాజీ ఈవో, ప్రముఖ రచయిత పీవీఆర్కే ప్రసాద్ మృతిచెందారు. ఆయన వయసు 77 యేళ్లు. అనారోగ్యంతో హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ గుండెపోటుతో సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు కూడా సోమవారమే పంజాగుట్ట శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. 
 
మాజీ ప్రధానమంత్రి నరసింహారావుకు మీడియా సలహాదారునిగా కూడా కొనసాగారు. అంతేకాకుండా, బాబ్రీ మసీదు కూల్చివేత, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ రాజీనామా తదితర విషయాలను వివరిస్తూ 'అసలేం జరిగిందంటే' పేరిట యధార్థ సంఘటనలతో ఓ పుస్తకం రాయగా, అది సంచలనం సృష్టించింది. ఇంకా 'కర్త అతడే', 'తిరుమల చరితామృతం', 'తిరుమల లీలామృతం'.. వంటి పుస్తకాలు కూడా రాశారు. 
 
పీవీఆర్‌కే ప్రసాద్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విపక్ష నేత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం తెలిపారు. పీవీఆర్‌కే ప్రసాద్‌ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు సలహాదారుగా సుదీర్ఘకాలం పనిచేశారు. అలాగే తిరుమల ప్రాశస్త్యంపై ఆయన పలు పుస్తకాలు రాశారు. పీవీఆర్‌కే‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments