Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికకు చిత్ర హింసలు... విముక్తి కల్పించిన ఐసీడీఎస్

Webdunia
ఆదివారం, 14 జూన్ 2020 (15:52 IST)
ఆభం శుభం తెలియని చిన్నారిని తల్లిదండ్రులు సాకలేక ఒ కుటుంబానికి అప్పగించగా ఇంటి యజమానులు బాలికకు నరకయాతన చూపిన హృదయ విదారక సంఘటన మేడ్చల్ పట్టణంలో వెలుగులోకి వచ్చింది. 
 
పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని కేఎల్ఆర్ వెంచర్‌లోని రాజరాజేశ్వరి అపార్టుమెంట్లో ఓ ఇంట్లో బాలికను తల్లిదండ్రులు రూ.10 వేలకు అప్పగించారు. ఆ ఇంటి యజమానులు చిన్నారి అని కూడా కనికరం చూపకుండా తీవ్రంగా గాయపరిచి వెట్టి చాకిరి చేయిస్తు హింసించారు. అది గమనించిన స్థానికులు ఐసీడీఎస్, బాలల హక్కుల సంఘం నేతలకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో ఆ ఇంటికి ఐసీడీఎస్ అధికారులు, రాష్ట్ర బాలల హక్కుల సంఘం సభ్యురాలు రాగజ్యోతి ఆ ఇంటికి వెళ్లి బాలికకు విముక్తి కల్పించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments