Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ఫక్కీలో సెల్‌ఫోన్ల భారీ చోరీ

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (21:16 IST)
గుంటూరు జిల్లాలో సినీఫక్కీలో చోరీ జరిగింది. మంగళగిరి- గుంటూరు జాతీయ రహదారిపై రూ.80 లక్షల విలువైన మొబైల్‌ఫోన్లను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు.

చిత్తూరు జిల్లా శ్రీసిటీ నుంచి కోల్‌కతాకు కంటైనర్‌లో వెళ్తున్న మొబైల్‌ ఫోన్లను దుండగులు దొంగిలించారు. 980 ఫోన్లు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. చోరీ జరిగిన విషయాన్ని తొలుత కంటైనర్‌ డ్రైవర్, క్లీనర్లు గమనించలేదు.

వెనుక వస్తున్న ఓ వాహనదారుడు కంటైనర్‌ను ఆపి వెనుక డోరు తెరుచుకుందని డ్రైవర్‌కు తెలపడంతో మొబైల్‌ఫోన్ల చోరీ జరిగినట్లు గుర్తించారు.

దీంతో మంగళగిరి సమీపంలోని కాజ టోల్‌గేట్ వద్ద కంటైనర్‌ను డ్రైవర్‌ ఆపి మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం, ఇతర బృందాలతో గాలింపు చేపట్టారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments