Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైపూర్‌లో భర్త విమానం ఎక్కించాడు.. కానీ శంషాబాద్‌లో మిస్ అయింది ఎలా?

జైపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన సాయి ప్రసన్న (28) అనే వివాహిత అదృశ్యమైంది. దీనిపై స్థానిక పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి ఆ మహిళ కోసం గాలిస్తున్నారు.

Webdunia
శుక్రవారం, 8 జూన్ 2018 (10:15 IST)
జైపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన సాయి ప్రసన్న (28) అనే వివాహిత అదృశ్యమైంది. దీనిపై స్థానిక పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి ఆ మహిళ కోసం గాలిస్తున్నారు.
 
సాయి ప్రసన్నను ఆమె భర్త జైపూర్లో విమానం ఎక్కించి అత్తమామలకు సమాచారం అందించాడు. ప్రసన్నను రిసీవ్ చేసుకోవడానికి తండ్రి, తమ్ముడు ఎయిర్ పోర్ట్‌కు వచ్చారు. అయితే తండ్రి తమ్ముడులకు తెలియకుండా సాయి ప్రసన్న వేరే క్యాబ్ ఎక్కి వెళ్లిపోయింది. కొంతదూరం వెళ్లిన తర్వాత తమ్ముడుకి కాల్ చేసి మాట్లాడి, ఆ తర్వాత స్విచాఫ్ చేసింది.
 
దీంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, జైపూర్లో ఉన్న సాయి ప్రసన్న భర్తకి విషయం తెలియజేశారు. సాయి ప్రసన్న అదృశ్యం వెనుక ఖమ్మంకి చెందిన మోహన్ రావు అనే వ్యక్తి ఉండొచ్చని ఆమె భర్త అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో సీసీ ఫుటేజీలే కీలకం కావడంతో ఆదిశగా పోలీసులు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments