Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడు రోజుల్లో పెళ్లి, నిద్రిస్తున్న యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (12:33 IST)
మరో ఏడు రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న యువతిపై కొందరు గుర్తు తెలియని దుండగులు హత్యా యత్నం చేసారు. ఆమె నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించారు. దాంతో ఆమె తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
 
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా తంబాలపల్లి నియోజకవర్గం ములకలచెరువు మండలం సొంపాలెం గ్రామంలో 24 ఏళ్ల యువతికి మరో 7 రోజుల్లో వివాహం జరుగనుంది. ఐతే కారణం ఏమిటో తెలియదు కానీ గురువారం తెల్లవారు జామున కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. ఆమె నిద్రిస్తుండగానే ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించారు.
 
మంటలు చెలరేగడంతో ఆమె కేకలు వేసింది. మరో గదిలో నిద్రిస్తున్న తల్లిదండ్రులు వచ్చి మంటలను ఆర్పారు. ఐతే అప్పటికే ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం మదనపల్లి మండలంలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమా మరేదైనా కారణమా అనే కోణంలో పరిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments