Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందిగం సురేశ్‌కు మరిన్ని కష్టాలు.. మహిళ హత్య కేసులో రిమాండ్

ఠాగూర్
సోమవారం, 7 అక్టోబరు 2024 (15:36 IST)
వైకాపాకు చెందిన మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మరిన్ని చిక్కులు ఎదురయ్యాయి. తాజాగా ఆయనను మరో కేసులో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 
ఇప్పటికే టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఆయన నిందితుడుగా ఉన్న విషయం తెల్సిందే. ఇపుడు వెలగపూడిలోని మరియమ్మ అనే మహిళ హత్య కేసులో కూడా ఆయన హస్తం ఉన్నట్టు పోలీసులు నిర్ధారించి కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనను అరెస్టు చేసి, మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
 
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టయి గుంటూరు జైల్లో ఉంటున్న నందిగం సురేశ్‌ను పోలీసులు తాజాగా వెలగపూడి మహిళ మరియమ్మ హత్య కేసులో అరెస్టు చేశారు. 2020లో తుళ్ళూరు మండలం వెలగపూడిలో మరియమ్మ అనే మహిళ హత్యకు గురైంది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల పోలీసులు పీటీ వారెంట్ కోరగా, కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయనను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments