Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందిగం సురేశ్‌కు మరిన్ని కష్టాలు.. మహిళ హత్య కేసులో రిమాండ్

ఠాగూర్
సోమవారం, 7 అక్టోబరు 2024 (15:36 IST)
వైకాపాకు చెందిన మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మరిన్ని చిక్కులు ఎదురయ్యాయి. తాజాగా ఆయనను మరో కేసులో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 
ఇప్పటికే టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఆయన నిందితుడుగా ఉన్న విషయం తెల్సిందే. ఇపుడు వెలగపూడిలోని మరియమ్మ అనే మహిళ హత్య కేసులో కూడా ఆయన హస్తం ఉన్నట్టు పోలీసులు నిర్ధారించి కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనను అరెస్టు చేసి, మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
 
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టయి గుంటూరు జైల్లో ఉంటున్న నందిగం సురేశ్‌ను పోలీసులు తాజాగా వెలగపూడి మహిళ మరియమ్మ హత్య కేసులో అరెస్టు చేశారు. 2020లో తుళ్ళూరు మండలం వెలగపూడిలో మరియమ్మ అనే మహిళ హత్యకు గురైంది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల పోలీసులు పీటీ వారెంట్ కోరగా, కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయనను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments