Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందిగం సురేశ్‌కు మరిన్ని కష్టాలు.. మహిళ హత్య కేసులో రిమాండ్

ఠాగూర్
సోమవారం, 7 అక్టోబరు 2024 (15:36 IST)
వైకాపాకు చెందిన మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మరిన్ని చిక్కులు ఎదురయ్యాయి. తాజాగా ఆయనను మరో కేసులో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 
ఇప్పటికే టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఆయన నిందితుడుగా ఉన్న విషయం తెల్సిందే. ఇపుడు వెలగపూడిలోని మరియమ్మ అనే మహిళ హత్య కేసులో కూడా ఆయన హస్తం ఉన్నట్టు పోలీసులు నిర్ధారించి కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనను అరెస్టు చేసి, మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
 
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టయి గుంటూరు జైల్లో ఉంటున్న నందిగం సురేశ్‌ను పోలీసులు తాజాగా వెలగపూడి మహిళ మరియమ్మ హత్య కేసులో అరెస్టు చేశారు. 2020లో తుళ్ళూరు మండలం వెలగపూడిలో మరియమ్మ అనే మహిళ హత్యకు గురైంది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల పోలీసులు పీటీ వారెంట్ కోరగా, కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయనను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తండ్రి కుర్చీ కోసం ఆశపడటం లేదు.. కానీ : హీరో విజయ్ (Video)

పరువు నష్టం దావా కేసు : హీరో నాగార్జున వాంగ్మూలం నమోదుకు కోర్టు ఆదేశం

రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఓ 'ఫుట్‌బాల్' వంటివారు : ప్రకాష్ రాజ్ (Video)

బిగ్ బాస్ తెలుగు సీజన్‌కు క్రేజ్ తగ్గిపోయినట్టేనా?

విశ్వం షూట్ లో ఫిజికల్ గా చాలెంజ్ లు ఎదుర్కొన్నా : కావ్యథాపర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments