Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతపై కరోనా పంజా... యువకుల్లో సగంమందికి పాజిటివ్

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (17:53 IST)
కరోనా రెండో దశ ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతోంది. గతంలో 50 ఏళ్ళు పై బడిన వారే ఎక్కువగా ఈ వైరస్ బారిన పడుతున్నట్లు వైద్యులు చెప్పారు. అయితే రెండో దశలో ఎక్కువగా యువకులే ఈ వైరస్ ధాటికి అల్లాడిపోతున్నట్లు రిపోర్ట్‌‌లు వెల్లడిస్తున్నాయి. 5 నుంచి 12 సంవత్సరాల లోపు పిల్లల్ని సైతం మహమ్మారి వదలడం లేదు.
 
మంగళగిరి పట్టణంలో బుధ, గురువారాల్లో 109 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 40 ఏళ్ల లోపు వారు 32 మంది ఉండగా, 30 ఏళ్ల లోపు వారు 16 మంది ఉన్నారు. 20 ఏళ్ల లోపు వారు 10 మంది, 10 ఏళ్ల లోపు వారు ముగ్గురు చొప్పున వైరస్ ప్రభావానికి గురయ్యారు.
 
మరణాల సంఖ్య కూడా పెరిగి పోతున్నా వివరాలు బయటకు రానివ్వటం లేదు. గతం కంటే పరిస్థితి భిన్నంగా ప్రమాదకరంగా మారింది. దీనిని బట్టి యువత అప్రమత్తంగా ఉంటూ సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ, కోవిడ్ నిబంధనలు పాటించాలి. నిర్లక్ష్యం వీడి మాస్కుల వాడకం భౌతిక దూరం పాటించటం విస్మరించకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
ప్రస్తుతం 45 ఏళ్ళు పైబడిన వారికే ప్రభుత్వం వ్యాక్సిన్ వేస్తుంది. మే ఒకటి నుండి 18 ఏళ్ళు నిండిన ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ వేస్తామని చెబుతున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న ఈ నేపథ్యంలో సాధ్యమైనన్ని ఎక్కువ మందికి టెస్టులు జరిపి అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తే మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments