Webdunia - Bharat's app for daily news and videos

Install App

అష్టా చెమ్మా.. పేకాటలతో కరోనా వ్యాప్తి.. 17మంది పాజిటివ్

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (17:50 IST)
కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో అందరూ ఇళ్లల్లోనే వుండిపొమ్మంటే.. జనాలు గుంపుగా అష్టా చెమ్మా, పేకాట, క్యారంబోర్డులు ఆడుతూ గడుపుతున్నారు. ఇలా చేయడం ద్వారా కరోనా సులభంగా వ్యాపిస్తోంది. ఇటీవల సూర్యాపేటలో ఓ మహిళ అష్టాచెమ్మ ఆడి 31 మందికి కరోనాను అంటించింది. తాజాగా విజయవాడలో కరోనా బారిన పడిన ఓ వ్యక్తి మరికొంత మందికి అంటించాడు.
 
కృష్ణలంకలోని గుర్రాల రాఘవయ్య వీధిలో ఓ లారీ డ్రైవర్ అద్దెకు ఉంటున్నాడు. అతడు ఇటీవల పశ్చిమ బెంగాల్‌కు వెళ్లొచ్చాడు. వచ్చిన వెంటనే తన స్నేహితులతో కలిసి పేకాట ఆడాడు. అనంతరం అతడు తీవ్ర జ్వరంతో బాధపడగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అతడితో పేకాడిన వారికీ పరీక్షలు నిర్వహించగా 17 మందికి పాజిటివ్ వచ్చింది. 
 
దీంతో కృష్ణలంకలోని గుర్రాల రాఘవయ్యగారి వీధిని పూర్తిగా మూసేశారు అధికారులు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల కుటుంబసభ్యులు కూడా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు. మరికొందరిని కొన్ని రోజుల పాటు హోంక్వారంటైన్‌లోనే ఉండాలని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments