Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ్ముడి ఇంటికి భార్య వెళ్లిందనీ సజీవదహనమైన భర్త.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 2 మే 2016 (17:16 IST)
ప్రకాశం జిల్లా తాళ్ళూరులో దారుణం జరిగింది. వద్దని చెపుతున్నా తన భార్య ఆమె సోదరుని ఇంటికి వెళ్లడాన్ని జీర్ణించుకోలేక పోయాడు. దీంతో శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని సజీవ దహనమయ్యాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
తాళ్లూరులోని ఎస్సీ కాలనీకి చెందిన ముంతా చిన అంజయ్య (29) గ్రామంలోని రాముల వారి మేడ వద్ద కుట్టు మిషన్‌పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. చిన అంజయ్య భార్య లలిత. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, లలిత తన తమ్ముడు పెళ్లికి పొదిలి మండలం గంజిపాలెం వెళ్లింది. పెళ్లి ముగించుకుని ఇంటికి రాకుండా తమ్ముడు నివాసముండే జబల్‌పూర్‌కు వెళుతున్నట్లు భర్తకు సమాచారం చేరవేసింది. దీనికి అతను వద్దని చెప్పాడు. అయితే, బంధువులంతా పట్టుబట్టడంతో ఆమె వెళ్లకతప్పలేదు.
 
దీన్ని తీవ్ర అవమానంగా భావించిన అంజయ్య... తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. దీంతో ఆదివారం సాయంత్రం ఇంటి వద్ద కిరోసిన్‌ వంటిపై పోసుకుని నిప్పంటించున్నాడు. చుట్టుపక్కలవారు మంటలను చల్లార్చే ప్రయత్నం చేసిపన్పటికి శరీరం అధికభాగం కాలిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ వి.మహేష్‌ సంఘటనా స్థలాన్ని చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలను విచారిస్తున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments