Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెత్తకుండీలో లక్షరూపాయలు దొరికితే.. మీరేం చేస్తారు?

లక్ష రూపాయలు చేతికి చిక్కితే దాచేసుకునే వారు కొందరుంటారు. కానీ పరాయి సొమ్ము పాముతో సమానమని భావించిన ఓ నిరుపేద పారిశుద్ధ్య కార్మికురాలు దొరికిన లక్ష రూపాయలను ఆ డబ్బుకు సొంతమైన యజమాని చేతిలో పెట్టేసింది

Webdunia
బుధవారం, 21 మార్చి 2018 (15:52 IST)
లక్ష రూపాయలు చేతికి చిక్కితే దాచేసుకునే వారు కొందరుంటారు. కానీ పరాయి సొమ్ము పాముతో సమానమని భావించిన ఓ నిరుపేద పారిశుద్ధ్య కార్మికురాలు దొరికిన లక్ష రూపాయలను ఆ డబ్బుకు సొంతమైన యజమాని చేతిలో పెట్టేసింది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా, మెట్ పల్లి కూరగాయల మార్కెట్ సమీపంలో జావేద్ చికెన్ దుకాణం నిర్వహిస్తున్నాడు. 
 
ఇతడు గత రాత్రి దుకాణం బంద్ చేసే సమయంలో ఓ చేతిలో చెత్త కవర్‌ని పట్టుకెళ్లాడు. చెత్తకుండీలో చెత్త కవరుకు బదులు.. డబ్బు కవర్‌ని విసిరేశాడు. చూసుకోకుండా ఇంటికెళ్లిపోయాడు. ఉదయం లేచి డబ్బుల కోసం కవర్ తెరిస్తే.. అందులో చెత్త ఉండటం చూసి షాక్ అయ్యాడు. వెంటనే బైకు తీసుకుని చెత్త కుండీ వద్దకెళ్లి వెతకడం ప్రారంభించాడు. 
 
దాన్ని చూసిన పారిశుద్ధ్య కార్మికురాలు లక్ష్మి డబ్బు కోసం వెతుకుతున్నాడని ఆరాతీసింది. ఆ డబ్బును తానే తీసిపెట్టానని చెప్పింది. దాచిన డబ్బును తీసుకొచ్చి అతనికి ఇచ్చింది. దీంతో అక్కడున్న వారంతా ఆమె నిజాయితీకి మెచ్చుకున్నారు. ఇంకా జావేద్ ఆమెకు నజరానాగా ఐదు వేల రూపాయలు అందజేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments