Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన మల్లి మస్తాన్ బాబు అంత్యక్రియలు.. వెంకయ్య హాజరు...

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2015 (15:03 IST)
భారత పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌ బాబు అంత్యక్రియలు శనివారం పూర్తయ్యాయి. నెల్లూరు జిల్లా సంగం మండలంలోని గాంధీజనసంఘంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో మస్తాన్‌బాబు అంత్యక్రియలు నిర్వహించారు. గౌరవ సూచికంగా పోలీసులు గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. మల్లిమస్తాన్‌ బాబును కడసారి చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. వీరిలో కేంద్ర మంత్రి కేంద్రమంత్రి వెంకయ్య, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథ రెడ్డి, రావెల కిషోర్‌, పి.నారాయణ, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డిలు మల్లి మస్తాన్ బాబు భౌతికకాయానికి నివాళులర్పించారు. 
 
అంతకుముందు మస్తాన్ బాబు అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య సాగింది. మస్తాన్ బాబు అమర్‌ రహే అంటూ అంతిమయాత్రలో పాల్గొన్న హితులు, స్నేహితులు, బంధువులు నినాదాలు చేశారు. అనంతరం గాంధీజనసంగంలోని అతని పొలంలోనే.... సాహసవీరుడు శాశ్వాత నిద్ర తీసుకున్నాడు. అధికారిక లాంఛనాలతో మస్తాన్‌బాబు అంత్యక్రియలు నిర్వహించారు. మస్తాన్‌బాబు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు హిందూ సంప్రదాయ పద్ధతిలో ఖననం చేశారు. 

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments