Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ముగ్గురు వైకాపా నేతలను లేపేస్తే రూ.50 లక్షల రివార్డు : మల్లాది వాసు

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (17:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన మంత్రులు, సీనియర్ నేతకు తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికార తెరాస కౌన్సిలర్ ఒకరు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీ మంత్రి కొడాలి నాని, వైకాపా పంచన చేరిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైకాపా నేత అంబటి రాంబులను భౌతికంగా లేకుండా చేస్తే (చంపేస్తే) రూ.50 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. 
 
ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్‌గా మల్లాది వాసు కొనసాగుతున్నారు. ఈ ముగ్గురు నేతలు మదపుటేనుగుల్లా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ముగ్గురు చంపేందుకు ఒక ఆపరేషన్ స్టార్ట్ చేయాలని, ఇందుకోసం అవసరమైతే రూ.50 లక్షల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. 
 
కమ్మ సంఘం వన సమారాధనల్లో మల్లాది వాసు ఈ సంచలన కామెంట్స్ చేశారు. ఒకపుడు కమ్మవారికి ధైర్యంగా ఉన్న పరిటాల రవిని చంపేరాని, ఇందుకోసం మొద్దు శీనును వాడుకున్నారన్నారు. పరిటాల రవి ఇపుడు జీవించివుండి వుంటే ఈ పరిస్థితి వచ్చేదికాదన్నారు. మాటిమాటికి నోరు జారుతున్న ఈ ముగ్గురి ఆట కట్టించేందుకు కమ్మ పెద్దలందరూ ఓ ప్రణాళిక చేపట్టాలంటూ సూచన చేస్తున్నట్టు ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కిలో అర్జునుడుగా విజయ్ దేవరకొండ.... తన పాత్రపై తొలిసారి స్పందన

తీవ్ర జ్వరంతో ఆస్పత్రి పాలైన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన మళ్లీ టిల్లు స్క్వేర్ హీరోయిన్

బాక్సాఫీస్ వద్ద 'కల్కి' కలెక్షన్ల వర్షం.. 4 రోజుల్లో రూ.500 కోట్ల కలెక్షన్లు!!

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments