Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపా మాజీ ఎంపీ కుమారుడు కన్నుమూత

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (08:06 IST)
ఇటీవల నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎంపీ మాగుంట బాబు కుమారుడు.. మాగంటి రాంజీ కన్నుమూశారు. విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన గత అర్థ రాత్రి తుదిశ్వాస విడిచారు. 
 
అయితే, తొలుత తెలుగు యువత పదవి రాలేదన్న బాధతో పాటు.. కొన్ని రకాలైన వేధింపు కేసులు ఆయనపై ఉన్నాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన బాబు పెద్ద కుమారుడైన మాగంటి రాంజీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారన్నది ఒక కథనంగా ఉంది.
 
అయితే, తాజాగా సమాచారం మేరకు, రాంజీ బ్రెయిన్ డెడ్‌ సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్టు చెబుతున్న ఆయనకు మూడు రోజులుగా వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రాంజీ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.
 
టీడీపీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండే రాంజీ, పార్టీ వ్యవహరాల్లో తండ్రికి సాయంగా ఉండేవారు. రాంజీ మృతి విషయం తెలిసి టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి. సినీ నటుడు నారా రోహిత్, మాజీ మంత్రి నారా లోకేశ్ తదితరులు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments