Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రి పేర్ని నానిపై తాపీతో దాడికి యత్నం?

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2020 (12:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాలనపై కార్మికులు, రోజువారీ కూలీల్లో అసంతృప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి కారణం, వారికి ఉపాధి లేకపోవడమే. ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఇసుక కంటికి కనిపించకుండా పోయింది. దీంతో భవన నిర్మాణ రంగం పూర్తిగా స్తంభించిపోయింది. ఫలితంగా వేలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారు. అనేక మంది భార్యాపిల్లలను పోషించలేక ఆత్మహత్య కూడా చేసుకున్నారు. 
 
ఈ క్రమంలో తాజాగా మచిలీపట్నంలో ఏపీ మంత్రి పేర్ని నానిపై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. ఇది స్థానికంగా కలకలం రేపింది. పేర్ని నాని ఇంటి వద్ద ఆయనపై నిందితుడు తాపీతో దాడికి యత్నించాడు. పేర్నినాని ఇంటి నుంచి బయటకు వస్తుండగా దాడి చేయడానికి ప్రయత్నించాడు. 
 
దీంతో అతడిని పట్టుకున్న పేర్ని నాని అనుచరులు అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడు మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments