Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలి పులి పంజా...! వణికిపోతున్న ఏజెన్సీ వాసులు...!

Webdunia
సోమవారం, 22 డిశెంబరు 2014 (12:56 IST)
కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుతో ఏజెన్సీ వాసులు గడ గడ వణికిపోతున్నారు. చింతపల్లి మండలం లంబసింగి, పాడేరు మండలంమినుములూరుతోపాటు మిగతా ప్రాంతాల ప్రజలు చలితో నరకయాతన అనుభవిస్తున్నారు.

రాష్ట్ర శివారులోని పర్యాటక ప్రాంతం లంబసింగిలో సున్నా, పాడేరు ఘాట్‌లోని పోతురాజుస్వామి గుడి వద్ద ఒక డిగ్రీ, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 3 డిగ్రీలు, మినుములూరు కేంద్ర కాఫీబోర్డు, అనంతగిరి, అరకుల్లో 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 
 
ఈ ప్రాంతాల్లో ఉదయం 10 గంటలు దాటాకే సూర్యుడు కనిపిస్తున్నాడు. సముద్ర మట్టానికి ఎత్తయిన ప్రదేశం కావడంతో ఏజెన్సీలో ఈ పరిస్థితి అని, జనవరిలో చలితీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డి.శేఖర్ వెల్లడించారు. 
 
ప్రస్తుతం ఇక్కడ ప్రజలు, వాహన చోదకులు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చలి తట్టుకోలేక చలి మంటలతో ఉపశనం పొందుతున్నారు. కాగా చలి మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments