Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి వర్షాలు

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2022 (15:28 IST)
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం నెలకొంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో ఏపీ తీరానికి చేరువగా అల్పపీడనం రానుంది. దీని ప్రభావం కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ వెల్లడించారు. 
 
దీని ప్రభావం కారణంగా ఏపీలో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అప్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఇది బుధవారం నాటికి ఏపీ తీరానికి చేరుకోవచ్చని పేర్కొంది. 
 
దీని ప్రభావం కారణంగా కోస్తాంధ్రలో పలు చోట్ల రాయలసీమలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 
 
అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర తీరంలో 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాదులు వీస్తాయని పేర్కొంది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యుకారులు మూడు రోజుల పాటు వేటకు దూరంగా ఉండాలని సూచన చేసింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments